
మేడిపల్లి, వెలుగు: ఫీర్జాదిగూడ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 13వ డివిజన్ వరంగల్ హైవే ప్రధాన రహదారిలో అనుమతులకు మించి నిర్మిస్తున్న భవనాన్ని మునిసిపల్ అధికారులు కూల్చేశారు. కమిషనర్ త్రిలేశ్వరరావు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ జె.ప్రశాంతి ఆదేశాలతో సిబ్బంది అట్టి నిర్మాణాన్ని తొలగించారు. ఈ క్రమంలో సిబ్బందిపై సదరు నిర్మాణదారులు దాడికి పాల్పడినట్లు సమాచారం.
ఈ సందర్భంగా టీపీవో ప్రశాంతి మాట్లాడుతూ.. అక్రమ నిర్మాణాలు చేస్తే ఎంతటివారైనా ఉపేక్షించబోమన్నారు. సిబ్బందిపై దాడి చేసినట్లు తెలిసిందని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కమిషనర్ త్రిలేశ్వరరావు తెలిపారు.
మైలార్దేవ్పల్లిలో..
శంషాబాద్: మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రహదారి పక్కన అనుమతులు లేకుండా ఏర్పాటు చేసుకున్న చిన్నపాటి నిర్మాణాలను జీహెచ్ఎంసీ అధికారులు గురువారం
తొలగించారు.