
వంగూరు, వెలుగు: చారకొండ మండలం సిర్సనగండ్ల సీతారామచంద్రాస్వామి ఆలయ భూముల్లో గురువారం అధికారులు అక్రమ కట్టడాలను తొలగించారు. హైకోర్టు ఉత్తర్వులతో భారీ బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాలు తొలగింపు చేప్టటారు. 34 మంది ఎలాంటి అనుమతి లేకుండా అక్రమంగా భూములు ఆక్రమించుకున్నారన్నారు. కోర్టు ఆదేశాలతో కల్వకుర్తి ఆర్డీవో సభావత్ శ్రీను, డీఎస్పీ వెంకటేశ్వర్లు, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ మదనేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో కూల్చివేతలు చేపట్టారు.
అధికార పార్టీకి చెందిన ఇళ్లను కాకుండా తమ ఇళ్లనే కూల్చుతున్నారని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి నివాసముంటున్న తమను ఇప్పటికిప్పుడు ఖాళీ చేయమంటే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసన మధ్య ఇండ్లను పూర్తిగా నేలమట్టం చేశారు. తహసీల్దార్ సునీత, ఎస్సై షంషుద్దీన్, ఎంపీడీవో ఇసాక్ హుస్సేన్, సీఐలు, నాగార్జున, నాగరాజు, వెంకట్ రెడ్డి, ఈఓ ఆంజనేయులు ఉన్నారు.
ఇళ్ల తొలగింపుతో ఉద్రిక్తత
పెబ్బేరు, వెలుగు: వనపర్తి వెళ్లే వైపు రోడ్డు వైడెనింగ్ గురువారం మధ్యాహ్నం ఇళ్ల తొలగింపు చేపట్టారు. నష్టపరిహారం ఇవ్వకుండా ఇళ్లను కూలగొడితే ఊరుకునేది లేదని యజమానులు అడ్డుకున్నారు. కొందరు యజమానులు జేసీబీ పైనా, అధికారులపైన రాళ్లు రువ్వడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు దాడి చేసిన ఇంటి యజమాని, వారికి సహకరించిన అందరినీ పీఎస్కు
తరలించారు.