
ఘట్ కేసర్, వెలుగు: పోచారం మున్సిపాలిటీ, కొర్రెముల ఏకశిల నగర్లో సర్వేనెంబర్లు 740, 741, 742లలో 7 ఎకరాల 16 గుంటల భూమి చుట్టూ అక్రమంగా నిర్మించిన ప్రహరీని కూల్చివేశారు. ఏకశిలనగర్ వెంచర్లో తప్పుడు పత్రాలు సృష్టించి వ్యవసాయ భూమిగా రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయించారని ఏకశిల నగర్ ప్లాట్ ఓనర్స్ హైడ్రా కమిషనర్కు ఫిర్యాదు చేశారు. సోమవారం హైడ్రా అధికారులు ఏకశిల నగర్ వెంచర్లో 7 ఎకరాల 16 గుంటల చుట్టూ నిర్మించిన గోడను ఎక్సవేటర్ల సాయంతో కూల్చివేశారు.
రికార్డులు పరిశీలించకుండానే ప్రహరీని కూల్చివేశారని ఓనర్ నూనె వెంకటనారాయణ ఆరోపించారు. ఈ విషయంలో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని చెప్పారు. భూమికి సంబంధించిన అన్ని రికార్డులు పరిశీలించిన తర్వాతే కొనుగోలు చేసినట్లు తెలిపారు.