బాలికల సోషల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ స్కూల్లో ఫుడ్ పాయిజన్

బాలికల సోషల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ స్కూల్లో ఫుడ్ పాయిజన్

కరీంనగర్ జిల్లా చొప్పదండిలోని బాలికల సోషల్ వెల్ఫేర్  రెసిడెన్సియల్ స్కూల్లో ఫుడ్ పాయిజన్ తో 105 మంది విద్యార్థులు అస్వస్థత పాలయ్యారు. ఇందులో 35 మంది విద్యార్థినులను కరీంనగర్ హాస్పిటల్ కు తరలించారు. మిగతావారిని స్కూల్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు. పాఠశాలలో మొత్తం 400 మంది విద్యార్థులు ఉన్నారు. మధ్యాహ్నం క్యాబేజి కూరతో అన్నం తిన్న  కొద్ది సేపటికే కడుపునొప్పి వచ్చి వాంతులు అయినట్లు విద్యార్థినులు చెబుతున్నారు.