
తాను ఫిల్మ్ మేకర్ నే కాని బిజినెస్ మెన్ ను కాదని డైరెక్టర్ రాంగోపాల్ వర్మ అన్నారు. కేవలం నెగిటివ్ అంశాల కోసం ఎవరూ సినిమా చూడరన్నారు. ఎమోషనల్ కాన్ ఫ్లిక్ ట్ఉంటేనే ఆదరిస్తారని చెప్పారు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విడుదల సందర్భంగా మీడియా ముందు మాట్లాడిన వర్మ ‘కోర్టు సమస్య పరిష్కారమైంది, ఎలక్షన్ కమిషన్ నుంచి ఎలాంటి అభ్యం తరాలు లేవు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తవడమే మిగిలింది. నిబంధనలకు లోబడి ఈ సినిమా తీశాను కనుక అభ్యంతరాలుండవు. నెగిటివిటీ ఉందని ప్రేక్షకులెప్పుడూ సినిమా చూడరు. ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్ ఉంటేనే చూస్తారు. అది లేకుండా తీస్తే బయోపిక్ కాదు. బాలకృష్ణతోనే తీసినా ఈ అంశం లేకుంటే చేసేవాడిని కాదు. ఆయనతోనూ ఇదే చెప్పాను. పద్మావత్, ఉడ్తా పంజాబ్ చిత్రాల తర్వాత సెన్సార్ బోర్డుకు సుప్రీం కోర్టు కఠిన నిబంధనలు విధించింది. క్యారెక్టర్ని నెగిటివ్ గా చూపించినప్పుడు అభ్యంతరం చెప్పొచ్చు . కానీ అది సినిమా విడుదలయ్యాక నిర్ణయించాలి, స్పెక్యులేషన్ పై కాదు. సుప్రీంకోర్టు తాజా నిబంధనల ప్రకారం పరువు నష్టం కేసు కూడా సినిమా విడుదలయ్యాక వేయాలి కానీ ముందు వేయడానికి వీల్లేదు. అందుకే ఇటీవల ‘మహానాయకుడు’ సినిమాలో నాదెండ్ల మనోహర్ పేరు డైరెక్ట్ గా చెప్పినా సినమా విడుదలయ్యింది. ఈ సినిమాలో వైసీపీ, కాంగ్రెస్ పార్టీ లేవీ లేవు.ఒక వ్యక్తికి వ్యతిరేకంగా ఉండొచ్చు. అలాగని మరొకరికి అనకూలమయ్యే చాన్స్ లేదు. నేను రాజకీయాలకు దూరం. చంద్రబాబు వల్ల నాకు నష్టం జరగలేదు, అలాగని జగన్ వల్ల లాభమూ జరగలేదు. లై ఫ్ లో ఎవరు ఏం చేసినా ఒకరికి లాభం వస్తే మరొకరికి నష్టం తప్పదు. ఎంత డబ్బు ఇస్తానని ఆశ చూపినా సినిమా రిలీజ్ ఆపను. నేను ఫిల్మ్ మేకర్ని, బిజినెస్ మేన్ ని కాదు.బయటి నుం చి చూస్తుంటే ఇక్కడ సినిమాలు తీయడం కష్టం అనిపిస్తుంది. కానీ అలాంటిదేం లేదు. ఒక ప్రజాస్వామ్య దేశంలో ఉన్నప్పుడు మీ హక్కు ప్రకారం మీరు చేస్తున్నప్పుడు కష్టమనేదేమీ ఉండదు. న్యాయపరంగా ఎలాంటి సమస్యలు వస్తాయో ముందుగా స్టడీ చేసే ప్రారంభించాను.‘ అని వర్మ అన్నారు.