ఎయిర్ పోర్టులో ఐఎంఎఫ్ చీఫ్ డ్యాన్స్

ఎయిర్ పోర్టులో ఐఎంఎఫ్ చీఫ్ డ్యాన్స్

న్యూఢిల్లీ:  జీ20 సమిట్ లో పాల్గొనేందుకు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్) చీఫ్ క్రిస్టాలినా జార్జివా ఢిల్లీకి చేరుకున్నారు. గురువారం ఆమెకు ఢిల్లీ ఎయిర్ పోర్టులో మనోళ్లు ఘన స్వాగతం పలికారు. ఎయిర్ పోర్టులో ఏర్పాటు చేసిన వేదికపై సంబల్ పురి సాంగ్ కు ఫోక్ డ్యాన్స్ చేస్తూ నృత్యకారులు స్వాగతం పలికారు. దీనికి జార్జివా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఆమె కూడా నాలుగు స్టెప్పులు వేసి సందడి చేశారు. ఈ వీడియోను కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ట్విట్టర్ లో పోస్టు చేశారు. సంబల్ పురి బీట్స్ కు ఎవరైనా డ్యాన్స్ చేయాల్సిందే అంటూ క్యాప్షన్ పెట్టారు.