ఘనంగా అమ్మవారి విగ్రహాల నిమజ్జనం

ఘనంగా అమ్మవారి విగ్రహాల నిమజ్జనం

దేవీ నవరాత్రుల్లో భాగంగా దుర్గాదేవి అమ్మవారి విగ్రహం ప్రతిష్టించి.. తొమ్మిది రోజులు పూజించి మంగళవారం నిమజ్జనానికి తరలించారు. దీంతో సిటీలో పలు ప్రాంతాల్లో సందడి నెలకొంది. బ్యాండు మేళ తాళాలతో అమ్మవారి విగ్రహాలను ట్యాంక్ బండ్ కు.. సమీపంలోని చెరువుల్లో నిమజ్జనానికి భక్తులు తరలించారు. అంతకుముందు మండపాల వద్ద అమ్మవారి చీరల వేలం పాట నిర్వహణతో పాటు  అన్నదాన చేశారు.