
ప్రముఖ స్వీడిష్ అధ్యయన సంస్థ స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(సిప్రి) విడుదల చేసిన థింక్ ట్యాంక్–2024 అధ్యయనం ప్రకారం భారతదేశ సైనిక వ్యయం పాకిస్తాన్ సైనిక వ్యయం కంటే దాదాపు తొమ్మిది రెట్లు ఎక్కువగా ఉన్నది. ఈ నివేదికను ఏప్రిల్ 28న సిప్రి విడుదల చేసింది.
సిప్రి నివేదిక ప్రకారం భారత సైనిక వ్యయం 1.6 శాతం మేరకు పెరిగి 86.1 బిలియన్ డాలర్ల(రూ.7.3 లక్షల కోట్ల)తో ప్రపంచంలోనే ఐదో స్థానంలో నిలిచింది. అదే సమయంలో పాకిస్తాన్ సైనిక వ్యయం 10.2 బిలియన్ డాలర్లుగా ఉన్నది.
ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక సైనిక వ్యయం కలిగిన దేశాలు అమెరికా, చైనా, రష్యా, జర్మనీ, భారత్ తొలి ఐదు స్థానాల్లో నిలిచాయి. ఈ ఐదు దేశాల సైనిక వ్యయం ప్రపంచ సైనిక వ్యయంలో 60 శాతం వాటా కలిగి ఉన్నది.