ఒకే స్కూటీపై 8 మంది ప్రయాణం.. వీడెవండీ బాబూ..!

ఒకే స్కూటీపై 8 మంది ప్రయాణం.. వీడెవండీ బాబూ..!

వెహికల్స్ పై వెళ్లేటప్పుడు జాగ్రత్తగా వెళ్లాలి.. నిబంధనలు పాటించి.. వాహనాలు నడపాలని అధికారులు పదే పదే చెబుతున్నా.. కొంతమందికి మాత్రం అవేవీ ఎక్కడం లేదు. రూల్స్ బ్రేక్స్ చేసి మరి వాహనాలు నడుపుతున్నారు.  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ వ్యక్తి... ఏడుగురు చిన్నారులను ఎక్కించుకుని స్కూటి నడిపాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

భద్రాద్రి కొత్తగూడం జిల్లా పాల్వంచలో ఓ యువకుడు స్కూటిపై ఏడుగురు చిన్నారులను కూర్చోబెట్టుకుని వెళ్తుండడం చాలామంది గమనించారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి వీడియో తీయడంతో ఈ విషయం బయటపడింది. ఏడుగురు పిల్లలను బండిపై కూర్చోబెట్టుకుని నడిపిస్తున్న సమయంలో ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే అప్పుడు పరిస్థితి ఏంటని చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటేనే మిగతావారిలో మార్పు వస్తుందంటున్నారు నెటిజన్లు. 

ALSO READ :Telangana Travel : ఈ వీకెండ్ జగిత్యాల అందాలు చూసొద్దామా..

ఏడుగురు చిన్నారులను కూర్చొబెట్టుకుని TS28N 7379 వాహనాన్ని ప్రమాదకరంగా నడిపిన వ్యక్తి పేరు కుమ్మరి కుంట్ల నాగేశ్వరరావు అని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. నాగేశ్వరరావుపై కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.