హెల్త్​లో రాష్ట్రానికి మస్తు ఇచ్చినం: కిషన్​ రెడ్డి

హెల్త్​లో రాష్ట్రానికి మస్తు ఇచ్చినం: కిషన్​ రెడ్డి

హైదరాబాద్​, వెలుగు: దేశంలో ఆరోగ్య రంగ అభివృద్ధికి కేంద్రం ఎన్నో చర్యలు తీసుకుందని, అందులో భాగంగా రాష్ట్రంలో అనేక సౌలతులు కల్పించిందని కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి చెప్పారు. రాష్ట్రానికి కేంద్రం ఏమేం చేసిందో వివరిస్తూ బుధవారం ప్రకటన విడుదల చేశారు. ‘‘ఆయుష్మాన్​ భారత్​ పథకం కింద రాష్ట్రంలో రూ.902 కోట్లతో 4,549 హెల్త్​ అండ్​ వెల్​నెస్​ సెంటర్లను ఏర్పాటు చేశాం.రూ.1,028 కోట్లతో బీబీనగర్​లో ఎయిమ్స్​ ఏర్పాటు చేశాం.

అందులో రూ.800 కోట్లతో వివిధ నిర్మాణాలు చేపట్టాం. గతంలో ఉన్న ఆసుపత్రిని 720 బెడ్స్ సూపర్​ స్పెషాలిటీ దవాఖానగా అభివృద్ధి చేశాం. 30 బెడ్స్​తో కూడిన ఆయూష్​ హాస్పిటల్​తో పాటు ఎంబీబీఎస్​, నర్సింగ్​ స్టూడెంట్లకు హాస్టళ్లు, సిబ్బందికి క్వార్టర్లు నిర్మించాం. స్టూడెంట్లకు క్లాసులతో పాటు ప్రజలకు ఓపీ సేవలు ప్రారంభించాం” అని పేర్కొన్నారు.