మిషన్ భగీరథ నీళ్లు ఎక్కడ..?

మిషన్ భగీరథ నీళ్లు ఎక్కడ..?

ఇంటింటికీ నీళ్లు సరఫరా చేస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంటే.. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. గుక్కెడు నీటి కోసం మహిళలు నానా ఇబ్బందులు పడుతున్నారు. మంచినీటి కోసం ఖాళీ బిందెలతో రోడ్డుపై ఆందోళనకు దిగుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలోని నాగల్కొండ గ్రామంలో తాగునీటి కొరత తీవ్రంగా ఉంది. ఈ విషయాన్ని ఎన్నిసార్లు అధికారుల దృష్టికితెచ్చినా వారు పట్టించుకోకపోవడంతో మహిళలు ఆందోళనకు దిగారు. ఖాళీ బిందెలతో రోడ్డుపై నిరసన తెలిపారు. 300 జనాభా ఉన్న తమ గ్రామానికి భగీరథ నీరు పూర్తి స్థాయిలో రావడంలేదని వారు వాపోయారు. అధికారులు పట్టించుకోకపోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా స్పందించి తాగునీటి కష్టాలు తీర్చాలని కోరుతున్నారు.