అల్లర్లకు నిరసనగా మణిపూర్​లో మహిళల మానవహారం

అల్లర్లకు నిరసనగా మణిపూర్​లో మహిళల మానవహారం

రాష్ట్రంలో జరుగుతున్న హింసాకాండను ఖండిస్తూ మణిపూర్​లోని పలు జిల్లాల్లో మైతీ తెగకు చెందిన వందలాది మంది మహిళలు వీధుల్లోకి వచ్చారు. శనివారం రాత్రి ఇంఫాల్ ఈస్ట్, ఇంఫాల్ వెస్ట్, తౌబాల్, కక్చింగ్ జిల్లాల్లో క్యాండిల్స్ పట్టుకుని కిలోమీటర్ల మేర మానవహారంగా నిల్చున్నారు. అక్రమ చొరబాట్లపై నిరసన వ్యక్తంచేస్తూ ఎన్నార్సీని అమలు చేయాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్లను కంట్రోల్ చేయడంలో, ప్రజలకు భద్రత కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఫెయిల్ అయ్యాయని మీరా పైబీ నేత తౌనోజం అసహనం వ్యక్తంచేశారు.