
గోదావరిఖని, వెలుగు: ఎమ్మెల్యే విజయం కోసం పనిచేసిన తనకు కాకుండా మరొకరికి టిక్కెట్ఇస్తున్నారని రామగుండంలో ఓ వ్యక్తి తన ఇంటికే నిప్పు పెట్టుకోవడానికి ప్రయత్నించాడు. రామగుండం కార్పొరేషన్లో గత పాలకవర్గంలో 32వ డివిజన్కార్పొరేటర్గా బక్కి రాజకుమారి ఉన్నారు. ఆమెతోపాటు భర్త కిషన్ టీఆర్ఎస్లో ఉన్నా అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి కోరుకంటి చందర్ కు మద్దతిచ్చారు. ప్రస్తుతం కార్పొరేషన్లోని పలు డివిజన్లను పునర్విభజన చేయగా వీరు నివసించే ప్రాంతం 44వ డివిజన్గా మారింది. జనరల్ కేటగిరీ చేశారు. ఈ డివిజన్నుంచి తనకు టికెట్కావాలని బక్కి కిషన్దరఖాస్తు చేసుకున్నాడు. రెండు రోజుల క్రితం కార్పొరేషన్లోని 50 డివిజన్లకుగాను 27 మంది అభ్యర్థిత్వాలను ఎమ్మెల్యే ఖరారు చేశారు. ఇంకా 23 మంది పేర్లను ప్రకటించాల్సి ఉంది. అందులో 44వ డివిజన్ కూడా ఉంది. టీఆర్ఎస్ నుంచి తనకు కాకుండా మరొకరికి టికెట్ఇస్తున్నారని తెలుసుకున్న కిషన్ శనివారం సాయంత్రం పెట్రోల్ పోసి తన ఇంటిని కాలబెట్టే ప్రయత్నం చేశారు. సీసాలో పెట్రోల్ తీసుకువచ్చి ఇంట్లో చల్లి అంటించగా కొంతమేర కాలింది. వెంటనే స్థానికులు నీళ్లతో మంటలను ఆర్పేశారు. టీఆర్ఎస్లో కష్టపడిన వారికి గుర్తింపు లేదని, తనకు టిక్కెట్ఇస్తానని హామీ ఇచ్చి నేడు దూరం పెట్టడంతో అసంతృప్తికి లోనయ్యాయని కిషన్ ఆవేదన వ్యక్తం చేశారు.