అనుమతుల్లేని ఇళ్ల నిర్మాణాలు కూల్చివేత

అనుమతుల్లేని ఇళ్ల నిర్మాణాలు కూల్చివేత

రంగారెడ్డి జిల్లాలో ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ నోటీసులు ఇవ్వకుండా నిర్మాణాలను కూల్చివేస్తుందంటూ ఆరోపణలు వస్తున్నాయి. అనుమతులు లేవంటూ 20 ఏళ్ల నాటి నిర్మాణాలను మున్సిపల్ అధికారులు సిబ్బంది కూల్చివేశారు. వినోభ నగర్ లో జ్ఞానసరస్వతి ఫౌండేషన్ ఆవరణలో కొన్ని నిర్మాణాలను కూల్చివేశారు. దీంతో సంస్థ సభ్యులు కూల్చివేతను అడ్డుకున్నారు. సంస్థ సభ్యులతో పాటు ఫౌండేషన్ పూర్వ విద్యార్థులు భారీగా చేరుకున్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో మున్సిపల్ అధికారులు వెనక్కి తగ్గారు.

మరిన్ని వార్తల కోసం

 

జోరుగా గోద్రెజ్​ జెర్సీ పాల అమ్మకాలు

నాటి కమెడియన్... నేటి ఉక్రెయిన్ అధ్యక్షుడు