మాంచెస్టర్ : ఆస్ట్రేలియాతో యాషెస్ సిరీస్ నాలుగో టెస్టులో ఆతిథ్య ఇంగ్లండ్ పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్లో భారీ ఆధిక్యంతో పాటు బౌలింగ్లోనూ రాణించి గెలుపు దిశగా ముందుకెళ్తోంది. ఓవర్నైట్ స్కోరు 384/4తో మూడో రోజు శుక్రవారం ఆట కొనసాగించిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 592 రన్స్ వద్ద ఆలౌటైంది. జానీ బెయిర్స్టో (99 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. బ్రూక్ (61), స్టోక్స్ (51) రాణించారు.
దాంతో, తొలి ఇన్నింగ్స్లో హోమ్ టీమ్ 275 రన్స్ లీడ్ సాధించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్కు వచ్చిన ఆసీస్ మూడో రోజు చివరకు 113/4తో కష్టాల్లో పడింది. లబుషేన్ (44 బ్యాటింగ్), మిచెల్ మార్ష్ (1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. మార్క్ వుడ్ మూడు వికెట్లు తీశాడు. ఆసీస్ ఇంకా 162 రన్స్ వెనుకంజలో ఉంది.