న్యూఢిల్లీ: దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 1033 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసులు 4,30,31,958కు చేరాయి.కాగా.. దేశవ్యాప్తంగా మొత్తం 1,222 మంది వైరస్ నుంచి బయటపడగా... 43 మంది చనిపోయారు. ఇందులో 4,24,98,789 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. మరో 11,639 మంది చికిత్స పొందుతుండగా... 5,21,530 మంది మృతిచెందారు. ముందు రోజు కంటే కేసుల్లో కొంత తగ్గదల కనిపించింది. మొత్తం కేసుల్లో 0.03 శాతం కేసులు మాత్రమే యాక్టివ్గా ఉన్నాయని, రికవరీ రేటు 98.76 శాతంగా ఉందని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.21 శాతంగా ఉందని తెలిపింది. ఇప్పటివరకు 79.25 కోట్ల కరోనా టెస్టులు చేశామని తెలిపింది.
మరిన్ని వార్తల కోసం...