హైదరాబాద్, వెలుగు: భూ కబ్జాకు సంబంధించిన కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్లో పోలీసులు తమ వాదనలతో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.
భూపాలపల్లి పోలీస్ స్టేషన్ పరిధి పుల్లూరి రామయ్యపల్లి సర్వే నంబర్ 209లోని రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశారన్న ఫిర్యాదు ఆధారంగా పిటిషనర్తో పాటు జ్యోతి, గౌతమ్రెడ్డిలపై జనవరిలో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో పోలీసులు అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని రమణారెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను ఇటీవల జస్టిస్ కె.లక్ష్మణ్ విచారించారు. పోలీసుల కౌంటర్ నిమిత్తం విచారణను ఈ నెల 30కి వాయిదా వేశారు.