యూపీలో ఎస్పీ, కాంగ్రెస్ మధ్య పొత్తు ఖరారు
సీట్ల సర్దుబాటులో ప్రియాంకదే కీలక పాత్ర
లక్నో : ఈ మేరకు ఇండియా కూటమి నేతల మధ్య ఒప్పందం కుదిరింది. బుధవారం సాయంత్రం లక్నోలోని ఓ హోటల్లో ఎస్పీ, -కాంగ్రెస్ నేతలు కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ యూపీ ఇన్చార్జ్ అవినాశ్ పాండే మాట్లాడుతూ.."యూపీలోని 17 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుందని చెప్పడానికి సంతోషంగా ఉంది. బీజేపీ నుంచి దేశాన్ని రక్షించడమే ఇండియా కూటమి టార్గెట్" అని వివరించారు.
పొత్తు నిర్ణయంలో ప్రియాంకదే కీలక పాత్ర
ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్-, ఎస్పీల మధ్య సీట్ల సర్దుబాటుపై సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా జరిపిన సంప్రదింపులే కీలక పాత్ర పోషించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. వారిద్దరూ రాహుల్ గాంధీతో చర్చించిన తర్వాత అఖిలేశ్తో మాట్లాడినట్లు తెలిపాయి. మంగళవారం సాయంత్రం ఎస్పీ ఏకపక్షంగా మూడో లిస్ట్ రిలీజ్ చేసింది. దాంతో ఇరు పార్టీల మధ్య పొత్తు ఉండదని అంతా భావించారు. కానీ కూటమిని గాడిలో పెట్టేందుకు ప్రియాంక గాంధీనే స్వయంగా ఎస్పీ చీఫ్ అఖిలేశ్తో ఫోన్లో మాట్లాడినట్లు సమాచారం.