దామి, రావత్లకు పరాజయం
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ ఎన్నికల ఫలితాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసకుంది. ఆ రాష్ట్ర సీఎం, ఎన్నికల్లో బీజేపీ ప్రచార బాధ్యతల్ని మోసిన పుష్కర్ సింగ్ధామి, కాంగ్రెస్ సీఎం అభ్యర్థి హరీశ్ రావత్ ఇద్దరూ ఓడిపోయారు. ఖటీమా సెగ్మెంట్నుంచి పోటీ చేసిన పుష్కర్ సింగ్ ధామి.. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ భువన్ చంద్ర కప్రి చేతిలో ఓడిపోయారు. ధామిపై కప్రి.. 6,951 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ధామికి 40,675 ఓట్లు రాగా.. భువన్ కప్రీకి 47,626 ఓట్లు వచ్చాయి. మాజీ సీఎం హరీశ్ రావత్ కూడా బీజేపీ అభ్యర్థి మోహన్ సింగ్ బిస్త్ చేతిలో ఓడిపోయారు. లాల్ కువా సెగ్మెంట్ నుంచి బరిలో దిగిన రావత్ బీజేపీ అభ్యర్థి బిస్త్ చేతిలో దాదాపు 14వేల ఓట్ల తేడాతో పరాజయం చెందారు.