
చందానగర్, వెలుగు : ఎంగేజ్మెంట్ అయిన నెల రోజులకే లాడ్జిలో యువకుడు సూసైడ్ చేసుకున్న ఘటన మియాపూర్ పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని వెస్ట్ గోదావరి జిల్లా మీడపాడు గ్రామానికి చెందిన లక్ష్మీనర్సింహామూర్తి(29) సిటీకి వచ్చి కేపీహెచ్బీ కాలనీలో ఫ్రెండ్స్తో కలిసి ఉంటున్నాడు. డ్రైవర్గా పనిచేస్తూ కారు రెంటల్ బిజినెస్ కూడా రన్ చేస్తున్నాడు. ఈ నెల 14న సాయంత్రం గోకుల్ ప్లాంట్స్లోని ఓ లాడ్జిలో మూర్తి రూమ్ తీసుకున్నాడు.
24 గంటలు దాటినా అతడు రూమ్ ఖాళీ చేయలేదు. దీంతో లాడ్జి సిబ్బంది 15న సాయంత్రం 6 గంటలకు రూమ్ దగ్గరికి వెళ్లి చూశారు. రూమ్లో మూర్తి ఫ్యాన్కు ఉరేసుకొని కనిపించాడు. సిబ్బంది వెంటనే మియాపూర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు మూర్తి బంధువులకు విషయం చెప్పారు. మూర్తికి నెలరోజుల కిందటే ఓ యువతితో ఎంగేజ్మెంట్ అయ్యిందని పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకు కారణాలు తెలియదని.. అతడి బంధువు కిశోర్ ఇచ్చిన కంప్లయింట్ మేరకు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.