బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్ర జలశక్తి మంత్రిని కలిసిన కిషన్రెడ్డి

బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్ర జలశక్తి మంత్రిని కలిసిన కిషన్రెడ్డి

న్యూఢిల్లీ: బనకచర్ల ప్రాజెక్టు వివాదంపై కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ తో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భేటీ అయ్యారు. బుధవారం(జూన్18) ఢిల్లీలోని శ్రమశక్తి భవన్ లో కేంద్ర మంత్రులు ఇద్దరు సమావేశం అయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరిపై నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్టు గురించి చర్చించారు. 

కేంద్ర జలశక్తిమంత్రిత్వ శాఖ నిబంధనలకు అనుగుణంగా పరిశీలించిన తర్వాతే గోదావరిపై బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై నిర్ణయం తీసుకుంటామని కిషన్ రెడ్డియి సీఆర్ పాటిల్ హామీ ఇచ్చారు. అన్ని భాగస్వామ్య పక్షాలతో చర్చించిన తర్వాత పారదర్శకంగా ప్రాజెక్టుకు సంబంధించిన నిర్ణయం తీసుకుంటామన్నారు. 

ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగకుండా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి సీఆర్ పాటిల్ భరోసా ఇచ్చారు.

►ALSO READ | బనకచర్ల అఖిలపక్షం మీటింగ్ నుంచి బీఆర్ఎస్ వాకౌట్