బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్రెడ్డి, ఫైళ్ల శేఖర్రెడ్డితో ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ అధికారుల సోదాలు మూడో రోజూ(జూన్ 16) ఉదయం 6 గంటల నుంచి కొనసాగుతున్నాయి. జూన్ 14న ప్రారంభమైన ఈ సోదాలు మూడ్రోజులుగా కొనసాగుతుండటం.. పలు కీలక డాక్యుమెంట్లు, స్వాధీనం చేసుకున్నట్లు లీక్లు రావడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోననే ఆసక్తి నెలకొంది.
బెంగళూరు, హైదరాబాద్తో పాటు రాష్ర్టంలోని పలు ప్రాంతాల్లో ఉన్న కార్యాలయాల టార్గెట్గా ఇవి జరుగుతున్నాయి. ప్రతి రోజు అర్ధరాత్రి వరకు సోదాలు జరగుతున్నాయి. సుమారు 60 ప్రాంతాల్లో 400 మంది అధికారులు సోదాల్లో పాల్గొన్నారు. హార్డ్ డిస్క్లు, బ్యాంక్ లాకర్స్ స్వాధీనం చేసుకున్నారు. అధికారులు ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి కి సైతం నోటీసులిచ్చి వెళ్లిపోయారు. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై ఐటీ దాడులు జరగడాన్ని నిరసిస్తూ.. ఆ పార్టీ నేతలు అధికారులకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారు. ఈ దాడులపై అధికార, ప్రతిపక్ష పార్టీ మధ్య రాజకీయ యుద్ధం నడుస్తోంది.