- సిటీలోని షాపుల్లో షురువైన బిజినెస్
- స్టాక్ రెడీ గా ఉంచిన యజమానులు
- రెండు అకడమిక్ ఇయర్లలో నష్టాలే
కరోనా కారణంగా రెండేండ్లుగా ఆన్లైన్ క్లాసులే జరుగుతుండగా విద్యకు సంబంధించిన అన్ని బిజినెస్లు డీలా పడిపోయాయి. సెప్టెంబర్ ఒకటి నుంచి మళ్లీ విద్యాసంస్థలు స్టార్ట్ అవుతుండగా వ్యాపారాలు షురూ అయ్యాయి. ప్రభుత్వం విద్యాసంస్థల రీ ఓపెన్ ప్రకటన చేయడంతో స్టూడెంట్స్, పేరెంట్స్ పుస్తకాలు, బ్యాగులు, స్టేషనరీ సామగ్రి కొనేందుకు వెళ్తుండగా షాపులు సందడిగా మారాయి. మొన్నటిదాకా ఖాళీగా కనిపించిన షాపుల్లో ఇప్పుడు రద్దీ నెలకొంది. యూనిఫామ్స్, బ్యాగ్లు, టిఫిన్ బాక్స్లు, వాటర్ బాటిళ్లు, సైకిళ్లు, పెన్నులు, కంపాక్స్ లు ఇలా అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తుండగా, ఆగిపోయిన వ్యాపారాలు మళ్లీ పుంజుకుంటున్నాయని షాపుల నిర్వాహకులు చెబుతున్నారు.
షాపుల్లో పెరిగిన కొనుగోలు
క్లాసులకు హాజరైతే నోట్ బుక్స్, టెక్ట్స్ బుక్స్, స్టడీ మెటీరియల్ఉండాలి. దీంతో కోఠి, అబిడ్స్ తదితర ఏరియాల్లోని షాపులకు స్టూడెంట్స్, పేరెంట్స్ వెళ్లి కొనుగోలు చేస్తుండగా సందడిగా కనిపిస్తున్నాయి. స్కూల్ నుంచి ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్ మెటీరియల్ కోసం ఎక్కువగా వస్తున్నారని ఇప్పుడిప్పుడే రద్దీ పెరుగుతోందని స్టోర్ నిర్వాహకులు సంతోష్ చెప్పారు. మొన్నటి వరకు సీజన్లో జరిగే బిజినెస్ లో 20 శాతమే జరిగిందని పేర్కొన్నారు. మరో వైపు డ్రెస్ లు, షూస్, సాక్స్ లు, టిఫిన్ డబ్బాలు, బ్యాగులపై కరోనా.. లాక్డౌన్ కారణంగా ట్రాన్స్ పోర్ట్ చార్జీలు పెరగడంతో అదనంగా 30 శాతం వరకు ధరలు పెరిగాయని అంటున్నారు.
బిజినెస్లేక ఇబ్బందులు పడుతున్నం
స్కూల్, కాలేజ్ బ్యాగ్లు, రెయిన్ కోట్లు, సైకిళ్లు అమ్ముతాం. 10 లక్షల స్టాక్ తెచ్చి పెట్టాం. కరోనాతో రెండేళ్ల నుంచి బిజినెస్ లేదు. ఇప్పటికే చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదు ర్కొంటున్నాం. స్కూల్స్, కాలేజీలు ఓపెన్ అవుతుండగా కస్టమర్లు రావడం మొదలైంది. ఈ సారైనా బిజినెస్ బాగుంటుందని ఆశిస్తున్నాం.
- మహ్మద్ జకీల్, షాప్ ఓనర్, కోఠి