కాన్పూర్: టెస్టు టీమ్లో తన సెలక్షన్ను శ్రేయస్ అయ్యర్ పూర్తి న్యాయం చేశాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లోనే సెంచరీ కొట్టి సత్తా చూపెట్టిన శ్రేయస్ కష్టాల్లో పడ్డ టీమ్ను మరోసారి ఆదుకున్నాడు. అయ్యర్ (125 బాల్స్లో 8 ఫోర్లు, 1 సిక్స్తో 65), కీపర్ వృద్ధిమాన్ సాహా (126 బాల్స్లో 4 ఫోర్లు, 1 సిక్స్తో 61 నాటౌట్ ) హాఫ్ సెంచరీలకు తోడు అశ్విన్ (32; 1/3) ఆల్రౌండ్ పెర్ఫామెన్స్ చేయడంతో న్యూజిలాండ్తో ఫస్ట్ టెస్టును టీమిండియా తన కంట్రోల్లోకి తెచ్చుకుంది. విజయానికి 9 వికెట్ల దూరంలో నిలిచింది. ఓవర్నైట్ స్కోరు 14/1తో నాలుగో రోజు, ఆదివారం ఆట కొనసాగించిన రహానెసేన ఓ టైమ్లో 51/5 స్కోరుతో వందలోపే ఆలౌటయ్యేలా కనిపించింది. కానీ, అశ్విన్ , అక్షర్ పటేల్ (28 నాటౌట్) సపోర్ట్తో అయ్యర్, సాహా టీమ్ను నిలబెట్టారు. దాంతో, సెకండ్ ఇన్నింగ్స్ను ఇండియా 234/7 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. ఫస్ట్ ఇన్నింగ్స్ లీడ్ కలుపుకొని కివీస్కు 284 రన్స్ టార్గెట్ ఇచ్చింది. ఛేజింగ్లో ఫోర్త్ డే చివరకు న్యూజిలాండ్ 4 ఓవర్లలో 4/1 స్కోరుతో నిలిచింది. ఫస్ట్ ఇన్నింగ్స్లో సత్తా చాటిన ఓపెనర్ విల్ యంగ్ (2)ను అశ్విన్ ఎల్బీ చేశాడు. ప్రస్తుతం మరో ఓపెనర్ టామ్ లాథమ్ (2 బ్యాటింగ్), నైట్ వాచ్మన్గా వచ్చిన సోమర్విల్లే (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. లాస్ట్ డే 9 వికెట్లు తీస్తే ఇండియాదే విక్టరీ. కివీస్ గెలవాలంటే మరో280 రన్స్ చేయాలి. బౌలింగ్కు సపోర్ట్ ఇస్తున్న పిచ్పై ఈ టార్గెట్ను అందుకోవడం అంత ఈజీ కాదు. పైగా, ఇండియాలో ఓ విజిటింగ్ టీమ్ నాలుగో ఇన్నింగ్స్లో ఛేజ్ చేసిన హయ్యెస్ట్ టార్గెట్ 276 మాత్రమే. అది కూడా ఎప్పుడో 1987లో వివ్ రిచర్డ్స్ కెప్టెన్సీలోని వెస్టిండీస్ ఈ రికార్డు అందుకుంది. కాబట్టి ఇండియాకే చాన్సెస్ ఉన్నాయి. టీమ్ను గెలిపించే బాధ్యత ఇప్పుడు బౌలర్ల చేతుల్లో ఉంది.
ఆదుకున్న అయ్యర్, సాహా
మ్యాచ్ ఇండియా కంట్రోల్లోకి రావడానికి కారణం శ్రేయస్ అయ్యర్, సాహానే. అశ్విన్, అక్షర్కు కూడా క్రెడిట్ ఇవ్వొచ్చు. వాస్తవానికి మార్నింగ్ సెషన్లో ఇండియా పరిస్థితి చూస్తే ఆదివారమే మ్యాచ్ ముగిసి కివీస్ గెలుస్తుందేమో అనిపించింది. 63 రన్స్ లీడ్తో డే స్టార్ట్ చేసిన ఇండియా సగం సెషన్లోనే 4 వికెట్లు కోల్పోయి 51/5తో డిఫెన్స్లో పడింది. స్టాండిన్ కెప్టెన్, వైస్ కెప్టెన్.. రహానె (4), పుజారా (22) మరోసారి ఫ్లాప్ అయ్యారు. తన మాస్టర్ క్లాస్ స్వింగ్ బౌలింగ్తో టిమ్ సౌథీ (3/75)తో పాటు జెమీసన్ (3/40) ఇండియాను దెబ్బకొట్టారు. డే స్టార్ట్ అయిన ఆరో ఓవర్లోనే జెమీసన్ టెంప్టింగ్ షార్ట్బాల్తో పుజారాను ఔట్ చేశాడు. పూర్ ఫామ్ కొనసాగించిన రహానె.. స్పిన్నర్ అజాజ్ వేసిన సూపర్ డెలివరీకి ఎల్బీ అయ్యాడు. ఓపెనర్ మయాంక్ (17) బాగానే హార్డ్ వర్క్ చేసినప్పటికీ టిమ్ సౌథీ నుంచి తప్పించుకోలేకపోయాడు. ఆపై, సౌథీ వేసిన ఫుల్ లెంగ్త్ బాల్కు జడేజా (0) ఎల్బీగా డకౌట్ అవడంతో ఇండియా సగం వికెట్లు లాస్ అయింది. అప్పటికి లీడ్ 100 రన్స్ మాత్రమే. ఈ టైమ్లో శ్రేయస్ మరోసారి టీమ్ను ఆదుకున్నాడు. అశ్విన్ తోడుగా కూల్గా బ్యాటింగ్ చేశాడు. స్ట్రెయిట్ డ్రైవ్తో ఫోర్ కొట్టి ఖాతా తెరిచిన అశ్విన్ స్టార్టింగ్లో కాసేపు అటాకింగ్ షాట్లతో బౌలర్లను డిఫెన్స్లో పడేశాడు. కివీస్ స్పిన్నర్లతో పాటు పేసర్లను అశ్విన్, అయ్యర్ పక్కాగా ఎదుర్కొన్నారు. 84/5తో లంచ్కు వెళ్లొచ్చిన తర్వాత కూడా మంచి కోఆర్డినేషన్తో ఆడుతూ స్కోరు వంద దాటించారు. అయితే, సెకండ్ సెషన్లో ఛేంజ్ బౌలర్గా వచ్చిన జెమీసన్ ..అశ్విన్ను బౌల్డ్ చేసి ఆరో వికెట్కు 52 రన్స్ పార్ట్నర్షిప్ను బ్రేక్ చేశాడు. ఇక, మెడనొప్పి కారణంగా కీపింగ్కు దూరంగా ఉన్న సాహా బ్యాటింగ్లో రాణించాడు. సోమర్విల్లే బౌలింగ్లో సాహా, అజాజ్ బౌలింగ్ అయ్యర్ చెరో సిక్సర్ కొట్టి ఇన్నింగ్స్కు జోష్ తెచ్చారు. ఈ క్రమంలో స్కోరు 150 దాటగా.. శ్రేయస్ 109 బాల్స్లో ఫిఫ్టీ కంప్లీట్ చేసుకున్నాడు. స్పీడు పెంచిన అయ్యర్.. సౌథీ వేసిన షార్ట్ బాల్ను పుల్ చేసేందుకు ట్రై చేసి కీపర్కు క్యాచ్ ఇచ్చాడు. దాంతో, ఏడో వికెట్కు 64 రన్స్ పార్ట్నర్షిప్ ముగిసింది. అయ్యర్ ఔటైనా.. సాహా తగ్గలేదు. టీ తర్వాత స్పిన్నర్ అక్షర్ పటేల్ సపోర్ట్తో స్కోరు 200 దాటించడంతో పాటు 115 బాల్స్లో సాహా ఫిఫ్టీ కంప్లీట్ చేసుకున్నాడు. మరో 20 నిమిషాల ఆట మిగిలుండగా రహానె ఇన్నింగ్స్ను డిక్లేర్ చేశాడు. అందుబాటులో ఉన్న 4 ఓవర్లను స్పిన్నర్లు అశ్విన్, అక్షర్తో వేయించాడు. కెప్టెన్ నమ్మకాన్ని నిలబెట్టిన అశ్విన్.. లో హైట్లో ఓ ఫ్లయిటెడ్ బాల్ వేసి ఓపెనర్ యంగ్ను ఎల్బీ చేశాడు. దీనికి విల్ రివ్యూ కోరినా డీఆర్ఎస్ టైమ్ (15 సెకండ్లు) అయిపోవడంతో అంపైర్లు అనుమతించలేదు. రీప్లేలో బాల్ స్టంప్స్ను మిస్సయినట్టు తేలింది.
షార్ట్ స్కోర్స్
ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్: 345 ఆలౌట్;
న్యూజిలాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్: 296 ఆలౌట్;
ఇండియా సెకండ్ ఇన్నింగ్స్: 234/7 డిక్లేర్డ్ (శ్రేయస్ 65, సాహా 61*, సౌథీ 3/75, జెమీసన్ 3/40); న్యూజిలాండ్ సెకండ్ ఇన్నింగ్స్: 4/1 (లాథమ్ 2*, సోమర్విల్లే 0*,
అశ్విన్ 1/3).
- డెబ్యూ టెస్టులో సెంచరీ, ఫిఫ్టీ కొట్టిన ఫస్ట్ ఇండియన్ శ్రేయస్ అయ్యర్. ఓవరాల్గా ఈ రికార్డు సాధించిన పదో ప్లేయర్గా నిలిచాడు.