మాథ్యూస్‌ సెంచరీ: ఇండియా టార్గెట్ -265

మాథ్యూస్‌ సెంచరీ: ఇండియా టార్గెట్ -265

శ్రీలంకతో భారత్ ఆఖరి లీగ్ మ్యాచ్

లీడ్స్ : వరల్డ్ కప్ 2019లో భాగంగా శనివారం ఇండియాతో జరుగుతున్న మ్యాచ్ లో శ్రీలంక ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన లంక..ఫర్వాలేదనిపించింది. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 264 రన్స్ చేసింది. ఓ దవలో 55/4 కష్టాల్లో పడ్డ లంకను మాథ్యూస్(113) సెంచరీ, తిరిమానె(53) హాఫ్ సెంచరీతో చెలరేగి ఆదుకున్నారు. శ్రీలంకకు గౌరవప్రధమైన స్కోర్ ను అందించారు.

భారత్ బౌలర్లలో..బుమ్రా(3), పాండ్యా(1), కుల్దీప్(1), జడేజా(1), భువనేశ్వర్ కుమార్(1) వికెట్లు తీశారు.