మహిళా సాధికారత దిశగా అడుగులు వేయాలి : రోషిణి

మహిళా సాధికారత దిశగా అడుగులు వేయాలి : రోషిణి
  • కాకా మాంటీస్సోరి స్కూల్​ డైరెక్టర్ రోషిణి

ముషీరాబాద్ : మహిళా సాధికారత దిశగా దేశం అడుగులు వేయాలని బాగ్​లింగంపల్లిలోని కాకా మాంటీస్సోరి స్కూల్​డైరెక్టర్ రోషిణి ఆకాంక్షించారు. నేటికీ దేశంలో మహిళలపై అత్యాచారాలు జరగడం బాధాకరమన్నారు. కాకా డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఇనిస్టిట్యూషన్ లో గురువారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యఅతిథిగా రోషిణి పాల్గొని, స్టూడెంట్లకు శుభాకాంక్షలు తెలిపారు.

త్యాగ ధనుల పోరాటాలను కొనియాడారు. ఈ సందర్భంగా ఇనిస్టిట్యూషన్ స్టూడెంట్లు సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్నారు. ఎన్ సీసీ స్టూడెంట్ల పరేడ్​అబ్బురపరిచింది. జాయింట్ సెక్రెటరీ రమణ, సీఓఓ రాజేష్ కుంద్రా, డైరెక్టర్ రిషికాంత్, తల్లిదండ్రులు పాల్గొన్నారు.