
ఇండియా, పాక్ మ్యాచ్ కోసం ఎదురుచూసే క్రికెట్ అభిమానులకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. గత టీ 20 వరల్డ్కప్లో ఒకే గ్రూప్లో పోటీ పడిన దాయాదులు ఇప్పుడు ఆసియా కప్ 2023లో మరోసారి తలపడనునున్నారు. ఈ మేరకు పురుషుల ఆసియా కప్ 2023, మహిళల ఆసియా కప్ 2024 గ్రూప్ల వివరాలను బీసీసీఐ అధ్యక్షుడు జైషా ప్రకటించారు. రెండేళ్లపాటు ఆసియా క్రికెట్ క్యాలెండర్, అండర్ -16, అండర్ - 19, ఎమర్జింగ్ టీమ్స్ (ఏ జట్లు), సీనియర్ పురుషులు, మహిళా జట్లకు సంబంధించిన షెడ్యూల్ను ఆయన విడుదల చేశారు. అయితే గతేడాది టీ20 ఫార్మాట్లో ఆసియా కప్ ను ఈ సారి వన్డే ఫార్మాట్ లో నిర్వహించాలని ఏసీసీ నిర్ణయించింది. ఈ టోర్నమెంట్ మే నేలలో ఉండనుంది.
50 ఓవర్ల ఈ టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు ఉంటాయి. రెండు గ్రూపులుగా విభజించబడ్డాయి. భారత్, పాకిస్తాన్ తో పాటు క్వాలిఫయర్ ఓ గ్రూప్ లో ఉండగా శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ లు మరో గ్రూప్ లో ఉన్నాయి. ఈ టోర్నీలో 15 మ్యాచ్లు జరుగుతాయి. ఈ ఆసియా కప్ కు ఏ దేశం ఆతిథ్యం ఇస్తుందో తెలియలేదు. ఈ ఏడాది ఆసియాకప్ ఆతిథ్య హక్కులు పాకిస్థాన్ వద్ద ఉండగా.. అక్కడికి వెళ్లేందుకు టీమిండియా ఆసక్తి చూపడం లేదు. మరి ఏం జరుగుతుందో చూడాలి.