సెకండ్ వన్డేల్ వెస్టిండీస్ పై 44 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. 238 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన వెస్టిండీస్ ను 193 పరుగులకే ఆలౌట్ చేసింది. దీంతో మూడు వన్డేల సిరీస్ ను భారత్ కైవసం చేసుకుంది. 238 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన వెస్టిండీస్ మొదటి నుంచి నెమ్మదిగానే ఆడింది. వెస్టిండీస్ ఓపెనర్ హోప్ 27,బ్రూక్స్ 44,అకేల్ హోసేన్ 34, ఓడెన్ స్మిత్ 24 మినహా ఎవరూ పెద్దగా రాణించలేదు. దీంతో ఇంకా 4 ఓవర్లు ఉండగానే వెస్టిండీస్ 193 పరుగులకు ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్లలో ప్రసిద్ధ కృష్ణ 4, శార్దూల్ ఠాకూర్ 2, చాహల్, వాషింగ్టన్ సుందర్, దీపక్ హుడా, సిరాజ్ లకు ఒక్కో వికెట్ పడ్డాయి.
అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 237 పరుగులు చేసింది. ఫిబ్రవరి 11న మూడో వన్డే జరగనుంది.
India (237/9) beat West Indies by 44 runs in second ODI of three-match series
— ANI (@ANI) February 9, 2022
(Photo: BCCI) pic.twitter.com/3QkMKm2ah7