దేశవ్యాప్తంగా 75వ స్వాతంత్ర్య దినోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. కేంద్రం ఇటీవల తలపెట్టిన హర్ ఘర్ తిరంగా ప్రచారంలో భాగంగా జాతీయ జెండా గొప్పతనాన్ని చాటేందుకు ఓ కోస్ట్ గార్డ్ చేసిన ప్రయత్నం ప్రజల్లో దేశభక్తిని తట్టిలేపేదిగా ఉంది. 3 రోజులు ప్రతీ ఇంటి మీద జాతీయ జెండా ఎగరాలన్న ప్రధాని మోడీ పిలుపు మేరకు ఇండియన్ కోస్ట్ గార్డ్ సముద్రం లోపల ఫ్లాగ్ డెమో నిర్వహించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా చేపట్టిన ఈ క్యాంపెయిన్ పై అందరికీ అవగాహన కల్పించాలనే సదుద్దేశంతో ఈ పని చేసినట్టు తెలుస్తోంది. కాగా దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుకతోంది.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఓ ఇండియన్ కోస్ట్ గార్డు సముద్రంలో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. దేశం మొత్తాన్నీ కదిలించే విధంగా ఉన్న ఈ అండర్ వాటర్ ఫ్లాగ్ డెమో ఇప్పుడు అందర్నీ ఆకర్షిస్తోంది. మామూలుగా భూమ్మీద త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయడం అందరికీ తెలిసిన ప్రక్రియే. కానీ ఈ సారి ప్రత్యేకంగా సముద్రపు నీటిలో మువ్వన్నెల జెండా రెపరెపలాడుతుండడంతో ఈ వీడియో వైరల్ గా మారింది.
Celebration at peak as India Coast Guard hoists the National Flag underwater on the occasion of the 75th year of India’s independence at the Andaman & Nicobar islands pic.twitter.com/eO9bqlPs8v
— ANI (@ANI) August 14, 2022