అండర్ 19 వరల్డ్ కప్లో టీమిండియా వరుసగా ఆరోసారి సెమీస్కు చేరుకుంది. ఆదివారం (ఫిబ్రవరి 1) బులవాయోలోని క్వీన్ స్పోర్ట్స్ క్లబ్లో జరిగిన మ్యాచులో పాకిస్తాన్పై భారత ఘన విజయం సాధించింది. తప్పక గెలవాల్సిన మ్యాచులో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమిష్టిగా రాణించి దాయాది దేశాన్ని 58 పరుగుల తేడాతో చిత్తు చేసింది. తద్వారా 2025 అండర్ 19 ఆసియా కప్ ఫైనల్ ఓటమికి టీమిండియా కుర్రాళ్లు ప్రతీకారం తీర్చుకున్నారు. సెమీస్ పోరులో భాగంగా ఇండియా ఇంగ్లాండ్తో తలపడనుంది.
ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ ఇండియా చేసిన ఇండియా 49.5 ఓవర్లలో 252 పరుగులు చేసింది. కెప్టెన్ ఆయుష్ మాత్రే డకౌటై తీవ్ర నిరాశ పర్చగా.. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (30) పర్వాలేదనిపించాడు. వేదాంత్ త్రివేది (65) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. చివర్లో కనిష్క్ చౌహాన్ (35) రాణించాడు. పాక్ బౌలర్లలో అబ్దుల్ సుబాన్ మూడు వికెట్లు పడగొట్టగా.. మహ్మద్ సయ్యం రెండు వికెట్లు, అలీ రజా ఒక వికెట్ తీశారు.
►ALSO READ | ఇండియాతో మ్యాచ్ ఆడం: టీ20 వరల్డ్ కప్లో పాల్గొనటంపై పాక్ సంచలన నిర్ణయం
అనంతరం 253 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ 46.2 ఓవర్లలో 194 పరుగులు చేసి ఆలౌటైంది. పాక్ బ్యాటర్లలో హంజా జహూర్ (42), ఉస్మాన్ ఖాన్ (66), ఫర్హాన్ యూసఫ్ (38) తప్ప మిగిలిన వారంతా విఫలమయ్యారు. దీంతో పాకిస్తాన్ కు ఓటమి తప్పలేదు. ఇండియా బౌలర్లలో ఖిలాన్ పటేల్, కెప్టెన్ ఆయుష్ మాత్రే చెరో మూడు వికెట్లు తీశారు. అంబరీష్, హెనిల్ పటేల్, కనిష్క్ చౌహాన్, విహాన్ మల్హోత్రా తలో వికెట్ సాధించారు.
