సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా బౌలర్లు వికెట్లు తీయడంలో విఫలమవుతున్నారు. రెండో రోజు ఆటలో భాగంగా తొలి రెండు సెషన్ లలో కేవలం ఒక వికెట్ మాత్రమే తీసుకున్నారు. ముత్తుస్వామి అద్భుత సెంచరీతో సఫారీలను పటిష్ట స్థితిలో ఉంచాడు. జాన్సెన్ (50), కైల్ వెర్రెయిన్ (45) రాణించడంతో సౌతాఫ్రికా రెండో రోజు లంచ్ సమయానికి 7 వికెట్ల నష్టానికి 428 పరుగులు చేసింది. క్రీజ్ లో ముత్తుస్వామి (107), జాన్సెన్ (51) ఉన్నారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టాడు. జడేజా రెండు.. సిరాజ్, బుమ్రాలకు తలో వికెట్ దక్కింది.
6 వికెట్ల నష్టానికి 316 పరుగులతో టీ విరామం తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన సౌతాఫ్రికా ఆరంభంలోనే వికెట్ తీసుకుంది. వెర్రెయిన్ వికెట్ తీసి జడేజా టీమిండియాకు బిగ్ రిలీఫ్ ఇచ్చాడు. దీంతో ముత్తుస్వామి, వెర్రెయిన్ ల 88 పరుగుల భాగస్వామ్యానికి తెర పడింది. వీరిద్దరూ 40 ఓవర్ల పాటు క్రీజ్ లో భారత బౌలట్లను కొరకరాని కొయ్యలా తయారయ్యారు. వెర్రెయిన్ ఔటైనా ముత్తుస్వామి, జాన్సెన్ సౌతాఫ్రికా జట్టును మరో కీలక భాగస్వామ్యాన్ని అందించారు. ఒక ఎండ్ లో ముత్తుస్వామి నిదానంగా ఆడినా మరో ఎండ్ జాన్సెన్ ఆరంభం నుంచే బౌండరీల వర్షం కురిపించాడు.
జాన్సెన్ తో పాటు ముత్తుస్వామి కూడా వేగంగా ఆడడంతో సౌతాఫ్రికా ఇన్నింగ్స్ శరవేగంగా కదిలింది. ఈ క్రమంలో ముత్తుస్వామి సెంచరీతో పాటు జాన్సెన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వీరిద్దరూ ఏడో వికెట్ కు 96 బంతుల్లోనే 91 పరుగులు చేశాడు. మూడో సెషన్ లో సౌతాఫ్రికా 112 పరుగులు రాబట్టి కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయింది.
తొలి సెషన్ లో సఫారీలదే ఆధిపత్యం:
6 వికెట్ల నష్టానికి 247 పరుగులతో రెండో రోజు ఆటను ప్రారంభించిన సౌతాఫ్రికా తొలి సెషన్ లో చాలా జాగ్రత్తగా ఆడింది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో తొలి గంట పూర్తిగా డిఫెన్స్ కే పరిమితమయ్యారు. ఆ తర్వాత పరుగుల వేగం పెంచిన వీరిద్దరి జోడీ జట్టు స్కోర్ ను 300 పరుగులు దాటించారు. ఈ క్రమంలో ముత్తుస్వామి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్ లో వికెట్ కీపర్ వెర్రెయిన్ ఓపిగ్గా ఆడడంతో ఈ సెషన్ లో ఇండియాకు వికెట్ రాలేదు. రెండో రోజు తొలి సెషన్ లో 69 పరుగులు రాబట్టిన సౌతాఫ్రికా వికెట్ ఏమీ కోల్పోలేదు.
