భారత ప్రభుత్వ ఆధీనంలోని సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్పీఎంసీఐఎల్) విభాగమైన భారత ప్రభుత్వ మింట్ (ఐజీఎం) ముంబయి, కోల్కతా, హైదరాబాద్, నోయిడాలోని శాఖల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు: 94.
విభాగాల వారీగా ఖాళీలు: సూపర్వైజర్ అస్సే 02, టి.ఒ. మెషినిస్ట్ 01, టి.ఒ. మెకానికల్ 02, టి.ఒ. మెటలర్జీ 01, ఎంగ్రేవర్ శిల్పం/ లోహపు పనులు 01, జూనియర్ హిందీ టైపిస్ట్ 01, లాబొరేటరీ అసిస్టెంట్ 01, జూనియర్ టెక్నీషియన్ (ఫిట్టర్) 47, జూనియర్ టెక్నీషియన్ అటెండెంట్ ఆపరేటర్– కెమికల్ ప్లాంట్ 03, జూనియర్ టెక్నీషియన్ 07, జూనియర్ టెక్నీషియన్ (కార్పెంటరీ) 01, జూనియర్ టెక్నీషియన్ (ఎలక్ర్టిషియన్) 02, జూనియర్ టెక్నీషియన్ గోల్డ్స్మిల్ 01, జూనియర్ టెక్నీషియన్ (మెల్టర్) 01.
విద్యార్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి సంబంధిత ట్రేడులో ఐటీఐ, డిప్లొమా, బీఈ/ బి.టెక్, ఏదైనా గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి.
వయోపరిమితి: 18 నుంచి 30 ఏండ్ల మధ్యలో ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: మార్చి 28.
లాస్ట్ డేట్: ఏప్రిల్ 27.
అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.600. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.200.
ఆన్లైన్ పరీక్ష : జూన్/జూలై 2026 (తాత్కాలికం)
సెలెక్షన్ ప్రాసెస్
ఆన్లైన్ పరీక్ష: ఆబ్జెక్టివ్ తరహాలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో జనరల్ అవేర్నెస్, రీజనింగ్, ఇంగ్లిష్, సంబంధిత సబ్జెక్టుపై ప్రశ్నలు ఉంటాయి.
స్కిల్ టెస్ట్/ టైపింగ్ టెస్ట్: కేవలం కొన్ని పోస్టులకు (ఉదా: ఆఫీస్ అసిస్టెంట్, టెక్నీషియన్) మాత్రమే ఉంటుంది.
డాక్యుమెంట్ వెరిఫికేషన్: మెరిట్ ఆధారంగా ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలిస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ igmnoida.spmcil.comను సంప్రదించండి.
