మేలో జీఎస్‌‌‌‌‌‌‌‌టీ రెవెన్యూ రూ.2.01 లక్షల కోట్లు..16.4 శాతం పెరుగుదల

మేలో జీఎస్‌‌‌‌‌‌‌‌టీ రెవెన్యూ రూ.2.01 లక్షల కోట్లు..16.4 శాతం పెరుగుదల

న్యూఢిల్లీ: ఈ ఏడాది మే నెలలో జీఎస్‌‌‌‌‌‌‌‌టీ కలెక్షన్స్ ఏడాది లెక్కన 16.4 శాతం పెరిగి రూ.2.01 లక్షల కోట్లకు చేరుకున్నాయని  ప్రభుత్వం ప్రకటించింది. ఏప్రిల్‌‌‌‌‌‌‌‌లో జీఎస్‌‌‌‌‌‌‌‌టీ కలెక్షన్స్ ఆల్-టైమ్ హై అయిన రూ.2.37 లక్షల కోట్లను  తాకింది. డొమెస్టిక్ ట్రాన్సాక్షన్స్ నుంచి వచ్చిన రెవెన్యూ 13.7శాతం పెరిగి రూ.1.50 లక్షల కోట్లకు,  ఇంపోర్ట్స్ నుంచి  వచ్చిన జీఎస్‌‌‌‌‌‌‌‌టీ రెవెన్యూ 25.2 శాతం పెరిగి రూ.51,266 కోట్లకు చేరాయి. 

మే నెల జీఎస్‌‌‌‌‌‌‌‌టీ వసూళ్లలో సెంట్రల్ జీఎస్‌‌‌‌‌‌‌‌టీ రెవెన్యూ రూ. 35,434 కోట్లు కాగా,  స్టేట్ జీఎస్‌‌‌‌‌‌‌‌టీ రూ.43,902 కోట్లు. ఇంటిగ్రేటెడ్ జీఎస్‌‌‌‌‌‌‌‌టీ కింద రూ. 1.09 లక్షల కోట్లు వసూళ్లయ్యాయి. సెస్ రెవెన్యూ రూ. 12,879 కోట్లకు పెరిగింది.  గత ఏడాది మే (2024)లో జీఎస్‌‌‌‌‌‌‌‌టీ కలెక్షన్ 1.72 లక్షల కోట్లుగా రికార్డయ్యింది.