
అంట్వెర్ప్: యూరోప్ టూర్లో ఇండియా విమెన్స్ జూనియర్ హాకీ జట్టు వరుసగా మూడో విజయాన్ని అందుకుంది. శుక్రవారం (june 13) జరిగిన మ్యాచ్లో ఇండియా 3–2తో బెల్జియంపై గెలిచింది. ఇండియా తరఫున సోనమ్ (4వ నిమిషం), లాల్తాంట్లువాంగి (32వ ని), కనికా సివాచ్ (51వ ని) గోల్స్ చేయగా, మేరీ గోయెన్స్ (37వ ని), మార్టే మేరీ (40వ ని) బెల్జియానికి గోల్స్ అందించారు.
స్టార్టింగ్ నుంచే దూకుడుగా ఆడిన ఇండియా ఫార్వర్డ్స్ ఫస్టాఫ్లో మంచి ఆధిపత్యాన్ని చూపెట్టారు. మూడో క్వార్టర్లో లభించిన పెనాల్టీ కార్నర్ను లాల్తాంట్లువాంగి గోల్గా మలిచింది. కానీ దీని నుంచి వెంటనే తేరుకున్న బెల్జియం మూడు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ కొట్టి స్కోరును సమం చేశారు.
మ్యాచ్ మరో 9 నిమిషాల్లో ముగుస్తుందనగా కనికా పెనాల్టీ కార్నర్ను గోల్గా మలిచి ఇండియాకు విజయాన్ని అందించింది. శనివారం జరిగే మ్యాచ్లో ఇండియా.. ఆస్ట్రేలియాతో తలపడుతుంది.