న్యూఢిల్లీ: రోడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ను బలోపేతం చేసే దిశలో దేశంలోనే మొదటిసారిగా వెహికల్క్రాష్ టెస్టింగ్ ప్రోగ్రామ్ భారత్ ఎన్క్యాప్ను మంగళవారం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ లాంఛ్ చేశారు. 3.5 టన్నుల మోటార్ వెహికల్స్ను ఇక్కడ టెస్ట్ చేసేందుకు వీలుంటుంది. వెహికల్స్లో రోడ్ సేఫ్టీ ఫీచర్లు పెంచడం అటు ఆటోమొబైల్ ఇండస్ట్రీకి, ఇటు సమాజానికి కూడా చాలా ముఖ్యమని గడ్కరీ ఈ సందర్భంగా చెప్పారు. అందరు స్టేక్హోల్డర్లను దృష్టిలో ఉంచుకునే ఈ భారత్ ఎన్క్యాప్ (న్యూ కార్ ఎసెస్మెంట్ప్రోగ్రామ్) రూపొందించినట్లు వెల్లడించారు. దేశంలో రోడ్ యాక్సిడెంట్లు, ఎయిర్ పొల్యూషన్ ప్రధానమైన సమస్యలుగా ఉన్నాయని గడ్కరీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఏటా 5 లక్షల యాక్సిడెంట్ల కారణంగా 1.50 లక్షల మంది మరణిస్తున్నారని చెప్పారు.
వెహికల్స్లో సేఫ్టీ స్టాండర్డ్స్ మెరుగుపరిచే లక్ష్యంతో సొంత క్రాష్ టెస్టింగ్ ప్రోగ్రామ్ భారత్ ఎన్క్యాప్ను తెచ్చినట్లు పేర్కొన్నారు. అక్టోబర్1, 2023 నుంచి భారత్ ఎన్క్యాప్ అమలులోకి రానుంది. ఆటోమోటివ్ ఇండస్ట్రీ స్టాండర్డ్ (ఏఐఎస్) 197 ప్రకారం తమ వెహికల్స్ను టెస్ట్ చేయమని కార్ల తయారీ కంపెనీలు స్వచ్ఛందంగా ఈ ప్రోగ్రామ్ కింద కోరవచ్చని చెప్పారు. టెస్టులలో కార్ పెర్ఫార్మెన్స్ ఆధారంగా 0 నుంచి 5 మధ్యలో స్టార్ రేటింగ్స్ను ఇస్తారు. దీంతో ఆయా కార్లలో సేఫ్టీ ప్రమాణాలు ఎలా ఉన్నాయనేది తెలుసుకోవచ్చు. రేటింగ్ ఆధారంగా కొనుగోలు నిర్ణయం తీసుకోవచ్చు. సేఫ్టీతో కూడిన కార్లకు డిమాండ్ పెరుగుతుందని అంచనాలున్న నేపథ్యంలో కస్టమర్ల అవసరాలను మాన్యుఫాక్చరర్లు అందుకోవాల్సి ఉంటుందని రోడ్, ట్రాన్స్పోర్ట్అండ్ హైవేస్ మంత్రిత్వ శాఖ ఒక స్టేట్మెంట్లో తెలిపింది.
సహకరిస్తామంటున్న ఆటో మొబైల్ కంపెనీలు
దేశంలోనే మొదటిసారిగా క్రాష్ టెస్టింగ్ప్రోగ్రామ్ భారత్ ఎన్క్యాప్ను లాంఛ్ చేయడం పట్ల ఆటోమొబైల్ ఇండస్ట్రీ హర్షం వ్యక్తం చేసింది. వెహికల్ సేఫ్టీ ప్రమాణాలు పెరగడానికి ఈ చొరవ వీలు కల్పిస్తుందని పేర్కొంది. భారత్ఎన్క్యాప్ కింద టెస్టింగ్ కోసం తమ మూడు వెహికల్స్ను మొదటి లాట్లోనే పంపనున్నట్లు మార్కెట్ లీడర్ మారుతి సుజుకి ఇండియా వెల్లడించింది. మరోవైపు హ్యుండై, మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీలు కూడా ప్రోగ్రామ్కు మద్దతు ఇవ్వనున్నట్లు ప్రకటించాయి. ఇండియాలో లాంఛ్ చేసే ప్రతి కారు తప్పనిసరిగా భద్రతా ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది.
ఎక్కువ భద్రత కోరుకునే కన్జూమర్లకు భారత్ ఎన్క్యాప్ మేలు చేకూరుస్తుంది. అలాగే, ఎక్కువ సేఫ్టీ ఫీచర్లు తెచ్చే మాన్యుఫాక్చరర్లు కూడా తమ వెహికల్స్లోని ఆ అదనపు ఫీచర్లను తెలియచేయడానికి ఈ ప్రోగ్రామ్ కింద ఇచ్చే స్టార్ రేటింగ్ సాయపడుతుందని మారుతి సుజుకి ఇండియా కార్పొరేట్ ఎఫెయిర్స్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాహుల్ భార్తి చెప్పారు. భారత్ ఎన్క్యాప్ను స్వాగతిస్తున్నట్లు హ్యుండై మోటార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ ఎన్సూ కిమ్ చెప్పారు.
వెహికల్స్ ప్రమాణాలు పెరగడానికి ఇది అవకాశం కల్పిస్తుందని పేర్కొన్నారు. తమ వెహికల్స్ అన్నింటినీ అత్యున్నత ప్రమాణాలతో అందించడానికి కట్టుబడి ఉన్నామని వివరించారు. కస్టమర్లలో భద్రతపై అవగాహన పెంపొందించేందుకు భారత్ ఎన్క్యాప్ ప్రోగ్రామ్వీలు కల్పిస్తుందని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్) ప్రెసిడెంట్ వినోద్ అగర్వాల్ చెప్పారు.