
ప్రపంచవ్యాప్తంగా కరోనా కట్టడిలో భారత్ కీలక పాత్ర పోషిస్తోందన్నారు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్గేట్స్. కరోనా వైరస్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ లో భారత్ ముఖ్య పాత్ర పోషిస్తుందని, ఒకసారి వ్యాక్సిన్ బయటకు వచ్చాక.. దాన్ని భారీ స్థాయిలో ఉత్పత్తి చేసి సరఫరా చేసేందుకు ప్రపంచ దేశాలు భారత్వైపు చూస్తున్నాయని తెలిపారు. వచ్చే ఏడాదిలో వ్యాక్సిన్ వస్తుందని ఆశిస్తున్నామన్న బిల్ గేట్స్… అది సమర్థంగా పనిచేస్తుంది, భద్రంగా ఉందని తెలిసిన వెంటనే.. ప్రపంచ దేశాలు భారత్వైపు చూస్తాయన్నారు. వీలనైంత తక్కువ సమయంలో భారత్.. టీకాను భారీ స్థాయిలో ఉత్పత్తి చేసి ప్రపంచ దేశాలకు అందిస్తుందని తెలిపారు. భారీ స్థాయిలో వ్యాక్సిన్ను ఉత్పత్తి చేసి… దాన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలతో పంచుకోవాలన్న భారత్ సంకల్పం ఇందుకు తోడ్పడుతుందన్నారు. సీరం ఇన్స్టిట్యూట్, భారత్ బయోటెక్, బయో-ఈ వంటి భారత సంస్థలను ప్రస్తావించారు బిల్ గేట్స్. వీటి సామర్థ్యంతో వ్యాక్సిన్ తయారీ సులభమవుతుందని అభిప్రాయపడ్డారు. వ్యాక్సిన్ ను తీసుకుని భారత్లో ఉత్పత్తి చేయాలన్న ఆలోచన మాకు ఉంది. అస్ట్రాజెనెకా, ఆక్స్ఫర్డ్, జాన్సన్ అండ్ జాన్సన్ నుంచి వచ్చిన టీకాను భారత్ కు అప్పగిచాలని అలోచిస్తున్నామన్నారు. వీటికి సంబంధించి భారీ డోసులను సీరం ఉత్పత్తి చేసే విషయంపై మాట్లాడుకున్నామని..బయో-ఈతోనూ చర్చలు జరుగుతున్నాయన్నారు బిల్ గేట్స్ . ఇప్పటికే బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ ద్వారా బిల్గేట్స్ .. కరోనాపై పోరాటానికి మిలియన్ డాలర్ల ఆర్థిక సాయం ప్రకటించారు.