దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు

దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు

దేశంలో కోవిడ్ కేసులు భారీగా తగ్గాయి. 30 వేలకు దిగువన కొత్త కేసులు నమోదయ్యాయి. దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 27 వేల 409 కేసులు రాగా..347 మంది కరోనాతో చనిపోయినట్లు ప్రకటించింది కేంద్ర ఆరోగ్యశాఖ. వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న 82 వేల 817 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 4 లక్షల 23 వేల 127 యాక్టివ్ కేసులున్నాయి. దేశంలో ఇప్పటివరకు 173.42 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ చేసింది కేంద్రం. రోజువారీ పాజిటివిటీ రేటు 2.23 శాతానికి తగ్గాయని చెప్పింది కేంద్రం. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయడంతోపాటు అందరూ మాస్క్ లు ధరించడం, భౌతిక దూరం పాటించడంతో కరోనా కంట్రోల్ లోకి వచ్చింది. 

మరిన్ని వార్తల కోసం

పూల్‌‌ గేమ్ భలే ఆడిండు

రోడ్డు వెయ్యలేదని.. ఓట్లెయ్యడానికి పోలే