దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. మహమ్మారి పూర్తిగా అదుపులోకి వస్తోంది. గత కొన్నిరోజులుగా నమోదవుతున్న కేసులు, మరణాలు గణనీయంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 3,116 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ 47 మంది మరణించారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 38,069 కేసులు ఉన్నాయి. రికవరీ రేటు 98.71 శాతానికి మెరుగుపడిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. ఇక దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ముమ్మరంగా సాగుతోంది.
మరిన్ని వార్తల కోసం