ఇండియా ఓపెన్ సెమీస్ లో పీవీ సింధు ఓటమి

ఇండియా ఓపెన్ సెమీస్ లో పీవీ సింధు ఓటమి

ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షెట్లర్ పీవీ సింధు ఇంటిదారిపట్టింది. శనివారం జరిగిన సెమీస్ లో థాయ్ లాండ్ కు చెందిన సుపానిడా  కథేథాంగ్ పై 14-21 21-13 10-21 తేడాతో ఓడిపోయింది. దీంతో మరోసారి టైటిల్ గెలిచే అవకాశం కోల్పోయింది. ఇండియా ఓపెన్ టోర్నీ టైటిల్ రేసు నుంచి నిష్క్రమించింది.