ఇండియా టీమ్ ఉన్న​ హోటల్​ ముందే పేలుళ్లు

ఇండియా టీమ్ ఉన్న​ హోటల్​ ముందే పేలుళ్లు
  • మన పారా షట్లర్లు సేఫ్‌‌

న్యూఢిల్లీ: ఉగాండా పారా బ్యాడ్మింటన్‌ టోర్నీలో పోటీ పడుతున్న ఇండియా పారా షట్లర్లంతా సేఫ్‌గా ఉన్నారు. ఈ టోర్నీ కోసం  54 మందితో కూడిన టీమ్‌ ఉగాండా రాజధాని కంపాలా వెళ్లింది. అక్కడి రెండు హోటళ్లలో టీమ్‌ మెంబర్స్‌ ఉండగా.. మంగళవారం ఓ హోటల్‌కు వంద మీటర్ల దూరంలో వరుస పేలుళ్లు జరగడంతో అంతా ఉలిక్కిపడ్డారు.  అయితే,  తామంతా సేఫ్‌గా ఉన్నామని, ఆందోళన అవసరం లేదని ఇండియా పారా బ్యాడ్మింటన్‌ చీఫ్‌ కోచ్‌ గౌరవ్‌ ఖన్నా చెప్పాడు. మరో హోటల్‌లోని టీమ్‌ మెంబర్స్‌ కూడా బాగానే ఉన్నారని,  టోర్నీ కూడా షెడ్యూల్‌ ప్రకారమే జరుగుతుందన్నాడు. తాను క్షేమంగానే ఉన్నానని ఈ టీమ్‌తో పాటు వెళ్లిన తెలుగు ఆటగాడు బోయ రామాంజనేయులు తెలిపాడు.