న్యూఢిల్లీ: చైనా, పాకిస్తాన్తో సమష్టిగా ముప్పు ఉన్న నేపథ్యంలో త్రివిధ దళాలైన ఆర్మీ, నేవీతోపాటు ఎయిర్ఫోర్స్ అప్రమత్తమైనట్లు తెలిసింది. ఈ విషయంలో మూడు దళాలు ఉమ్మడిగా ముందుకెళ్తున్నట్లు డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ ఎస్టాబ్లిష్మెంట్లోని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. టాప్ ఐఏఎఫ్ కమాండర్స్తో డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ బుధవారం సమావేశమయ్యారు. ఈ మీటింగ్లో ఎల్ఏసీ వెంబడి నుంచి దళాలు వెనక్కి తగ్గడంపై రాజ్నాథ్ వివరాలు అడిగి తెలుసుకున్నారని ఓ ఐఏఎఫ్ అధికారి చెప్పారు. బార్డర్స్లో ఎదురవుతున్న సవాళ్లను దీటుగా ఎదుర్కోవడానికి దళాలను సిద్ధం చేసినందుకు ఐఏఎఫ్ కమాండర్లను రాజ్నాథ్ మెచ్చుకున్నారని తెలిసింది. దేనిని ఎదుర్కోవడానికైనా ఆర్మ్డ్ ఫోర్సెస్ ప్రిపేర్డ్గా ఉండాలని అధికారులను రాజ్నాథ్ ఆదేశించారని సమాచారం.
ఎల్ఏసీ వెంబడి తూర్పు లడఖ్లో ఉద్రిక్తతలు పెరిగిన సమయంలో లైన్ ఆఫ్ కంట్రోల్ లేదా ఇంటర్నేషన్ బార్డర్ (ఐబీ) వద్ద పాకిస్తాన్ ఏం చేస్తుందోనని ఎదురు చూశామని ఆయా వర్గాలు తెలిపాయి. అయితే ఆశ్చర్యకరంగా పాకిస్తాన్ ఎలాంటి దుందుడుకు చర్చలకు పాల్పడలేదని సదరు వర్గాలు ఆశ్యర్య వ్యక్తం చేశాయి. పాక్ మౌనం తమను ఆశ్చర్యానికి గురి చేస్తోందని, ఎందుకంటే వాళ్లు ఎల్వోసీ దగ్గర ఉద్రిక్తతలకు పాల్పడలేదని ఆయా వర్గాలు పేర్కొన్నాయి. ‘చైనా మనల్ని లడఖ్లో ఉండేలా చేసి మరొక సెక్టార్ (ప్రాంతం)లో దాడులు చేస్తుంది. అరుణాచల్ ప్రదేశ్లో ఏమైనా చేయొచ్చు. దీనికి ఎల్ఓసీ వెంబడి ఉన్న పాకిస్తాన్ చర్యలకు సంబంధం ఉంటుంది’ అని సదరు వర్గాలు వివరించాయి.