భారత్‌లో తగ్గుతున్న కోవిడ్ కేసులు

భారత్‌లో తగ్గుతున్న కోవిడ్ కేసులు

భారత్‌లో కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయి. గత కొన్ని రోజులుగా పదివేలకు లోపే పాజిటివ్ కేసులు రికార్డ్ అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 5,476 కొత్త కేసులు నమోదు అయ్యాయి. ఇక కోవిడ్ కారణంగా తాజాగా 158 మంది మృతి చెందారు. 9,754 మంది కరోనా నుంచి విజయవంతంగా కోలుకున్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 59,442 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,29,62,953కి చేరింది. అయితే క్రియాశీల కేసులు 59,442కి తగ్గాయి.  ఇక కోవిడ్ కారణంగా  మృతిచెందిన వారి సంఖ్య 5,15,036కి చేరింది.