భారత్లో కరోనా కలకలం కొనసాగుతూనే ఉంది. అయితే కేసుల సంఖ్య భారీగా తగ్గుతూ వస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా దేశంలో 3993 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక వైరస్ బారిన పడి తాజాగా 108 మంది మృతి చెందారు. ఇక దేశ వ్యాప్తంగా 49,948 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. భారత్లో ఇప్పటివరకు 77.43 కోట్ల కరోనా పరీక్షలను నిర్వహించారు. ప్రభుత్వ డేటా ప్రకారం, గత 24 గంటల్లో 8,73,395 కరోనా పరీక్షలు నిర్వహించారు. మరోవైపు కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా నిరంతరం కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు 1,79,13,41,29 మందికి వ్యాక్సినేషన్ పూర్తయ్యింది.
COVID19 | India registers 3,993 new cases and 108 deaths in the last 24 hours; Active cases stand at 49,948 pic.twitter.com/XvT64ZGZ31
— ANI (@ANI) March 8, 2022