భారత్ లో కరోనా కేసులు రోజురోజుకు తగ్గుతూ వస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో తాజాగా 13,166 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కొత్తగా వైరస్ బారిన పడి 302 మంది చనిపోయారు. దీంతో దేశ వ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య 5 లక్షల13వేల 226కు చేరింది. ఇక వైరస్ నుంచి తాజాగా 26వేల 988 మంది రికవరీ అయ్యారు. దీంతో మొత్తం కరోనా రికవరీల సంఖ్య 4 కోట్ల 22 లక్షల 4వేల 884కు చేరింది. ప్రస్తుతం డైలీ పాజిటివ్ రేటు 1.28 శాతంగా ఉంది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య లక్షా 34వేల 235 గా ఉంది.
మరోవైపు దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ సాగుతోంది. పెద్దలతో పాటు.. టీనేజర్లకు కూడా వ్యాక్సిన్ అందిస్తున్నారు. ఇప్పటివరకు 1,76,86,89,266మందికి కోవిడ్ వ్యాక్సిన్ అందించారు.