దేశంలో తగ్గిన కరోనా కేసులు

దేశంలో తగ్గిన కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు తగ్గాయి. నిన్నటికంటే ఇవాళ 1396 కేసులు తగ్గాయి. నిన్న 17వేల 336 కేసులు నమోదైతే..గడిచిన 24 గంటల్లో 15 వేల 940 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24గంటల్లో 20మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 4,27,64,481 మంది బాధితులు మహమ్మారి నుంచి కోలుకున్నారు. దేశ వ్యాప్తంగా 91వేల 779 యాక్టివ్ కేసులున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనాతో ఇప్పటి వరకు 5 లక్షల 24 వేల 974 మంది ప్రాణాలు కోల్పోయారు. 

కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలో,కేరళలో, ఢిల్లీలో రాష్ట్రాల్లో ఎక్కువ కేసులు నమోదయ్యాయి. కాగా కేసులు పెరుగుతుండడంతో పాజిటివిటీ 4.39శాతానికి చేరిందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్య శాఖ అధికారులు హెచ్చరించారు.