దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు..

దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు..

భారత్ లో కరోనా విజృంభణ  కొనసాగుతూనే ఉంది. గత నాలుగు రోజులుగా కేసుల సంఖ్య రెండు లక్షలకు పైగా నమోదవుతోంది. అయితే నిన్నటితో పోల్చితే కేసుల సంఖ్య స్వల్పంగా  తగ్గింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 2,51,209 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక కరోనా బారిన పడి ఒక్కరోజే 627 మంది మరణించారు. ఇక 24 గంటల్లో కరోనా నుంచి 3,47,443 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 21,05,611  పాజిటివ్ కేసులు ఉన్నాయి. పాజిటివిటీ రేటు 15.88 శాతంగా ఉంది. ఇక ఇప్పటివరకు భారత్ లో 1,64,44,73,216 మందికి వ్యాక్సినేషన్ పూర్తయ్యింది.