దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు

దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు నిన్నటి కంటే స్వల్పంగా పెరిగాయి. దేశంలో కొత్తగా 30 వేల 615 కరోనా కేసులొచ్చాయి. నిన్నటితో పోలిస్తే 11 శాతం కేసులు పెరిగాయి. కరోనా నుంచి మరో 82 వేల 988 మంది కోలుకున్నారు. గత 24 గంటల వ్యవధిలో కరోనాతో 514 మంది చనిపోయినట్లు ప్రకటించింది కేంద్ర ఆరోగ్య శాఖ. దేశంలో 4 లక్షలకు దిగువన కరోనా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం 3 లక్షల 70 వేల 240 యాక్టివ్ కేసులున్నాయి. డైలీ పాజిటివిటీ రేటు 2.45 శాతంగా నమోదైంది. ఇప్పటి వరకు కరోనా నుంచి 4 కోట్ల 18 లక్షల మందికి పైగా కోలుకున్నాయి. ఇప్పటివరకు 173కోట్ల 86 లక్షలక పైగా టీకా డోసులు పంపిణీ చేసినట్లు తెలిపింది కేంద్రం.

 

ఇంజనీరింగ్​ డిగ్రీ ఉంటే చాలు..టీఎస్ లో మస్తు ఉద్యోగాలు

ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ బప్పి లహిరి మృతి