భారత్‌లో తగ్గిన కరోనా కేసులు

భారత్‌లో తగ్గిన కరోనా కేసులు

కరోనా వైరస్ కేసులు ఇంకా నమోదు అవుతూనే ఉన్నాయి. అయితే గతంతో పోల్చితే కేసుల సంఖ్య భారీగా తగ్గుతోంది. తాజాగా భారత్‌లో నాలుగువేల లోపే పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంట్లలో భారత్‌లో 3,614 కొత్త కోవిడ్ కేసులు రికార్డ్ అయ్యాయి. కరోనా బారిన పడి తాజాగా 5,185 రికవరీ అయ్యారు. అయితే కరోనా మరణా సంఖ్య రెండు రోజులుగా వంద లోపే నమోదు అవుతోంది. నిన్న కరోనా కారణంగా 89 మంది మృతి చెందారు. 

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 40,559 (0.09%) కోవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. డైలీ పాజిటివ్ రేటు 0.44% శాతంగా ఉంది. ఇప్పటి వరకు కరోనా వైరస్ బారిన పడి 4,24,31,513మంది కోలుకున్నారు. దేశ వ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య ఇప్పటివరకు 5,15,803కు చేరింది. మరోవైపు కోవిడ్ వ్యాక్సినేషన్ కూడా కొనసాగుతోంది. 1,79,91,57,486 మందికి రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయ్యింది.