
- బాదం, వాల్నట్స్, మెటల్స్ వంటి దిగుమతులపై సుంకాలు పెంచే ఛాన్స్
- స్టీల్, అల్యూమినియంపై సుంకాలను ట్రంప్ పెంచడమే కారణం
- ఆయన మొదటిటెర్మ్లో కూడా ప్రతీకార టారిఫ్లు వేసిన భారత ప్రభుత్వం
- డబ్ల్యూటీఓ నోటీస్ను పట్టించుకోని అమెరికా
న్యూఢిల్లీ: యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ స్టీల్, అల్యూమినియంపై టారిఫ్లు పెంచడంతో ప్రతీకారంగా ఇండియా కూడా యూఎస్ ప్రొడక్ట్లపై టారిఫ్లు వేయాలని ఆలోచిస్తోంది. వీటిపై మొదట 25 శాతం టారిఫ్ విధించినప్పుడు వరల్డ్ ట్రేడ్ ఆర్గనేజైషన్ (డబ్ల్యూటీఓ) కు భారత ప్రభుత్వం వెళ్లింది. ఇండియా మే 9 న ఇష్యూ చేసిన డబ్ల్యూటీఓ నోటీస్ను యూఎస్ ప్రభుత్వం తిరస్కరించింది. ఇందులో స్టీల్, అల్యూమినియంపై వాషింగ్టన్ విధించిన భారీ ఇంపోర్ట్ టారిఫ్లకు ప్రతీకారంగా చర్యలు తీసుకుంటామని పేర్కొంది.
యూఎస్ మాత్రం తమ చర్యలు లోకల్ కంపెనీలను రక్షించడానికి తీసుకున్నవి కాదని, దేశ రక్షణ కోసం తీసుకున్నవని, అందుకే ఈ విషయంపై న్యూఢిల్లీతో చర్చించమని తెలిపింది. ట్రంప్ గవర్నమెంట్ స్టీల్, అల్యూమినియంపై విధించిన 25 శాతం టారిఫ్ను తాజాగా 50 శాతానికి పెంచిన విషయం తెలిసిందే. ఈ నెల 4 నుంచి ఈ కొత్త రేటు అమలులోకి రానుంది.
అమెరికా దిగుమతులపై సుంకాలు
ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా నుంచి చేసుకుంటున్న దిగుమతులు (ఉదా: బాదం, వాల్నట్స్)పై ఇస్తున్న కొన్ని ప్రయోజనాలను ఆపేయాలని, యూఎస్ నుంచి వచ్చే మెటల్స్పై కస్టమ్స్ డ్యూటీని పెంచాలని ప్రభుత్వం చూస్తోంది. కాగా, ఈ ఏడాది ఫిబ్రవరి 10 న తీసుకున్న ట్రంప్ నిర్ణయానికి వ్యతిరేకంగా ఇండియా డబ్ల్యూటీఓ నోటీస్ ఇష్యూ చేసింది. ఈ ఏడాది మార్చి 12 నుంచి అన్ని స్టీల్, అల్యూమినియం ఇంపోర్ట్స్పై 25 శాతం టారిఫ్ను యూఎస్ గవర్నమెంట్ విధిస్తోంది. మే 9న డబ్ల్యూటీఓకి చేసిన నోటిఫై ప్రకారం, ఈ డేట్ నుంచి 30 రోజుల తర్వాత, అంటే జూన్ 8 నుంచి యూఎస్కు ఇచ్చిన “రాయితీలు, ఇతర ప్రయోజనాలను” ఇండియా నిలిపివేయనుందని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు.
ఇండియా నోటీస్కు స్పందిస్తూ, మే 22న డబ్ల్యూటీఓకి ఇండియా ప్రపోజ్ చేసిన ప్రతీకార చర్యలు ట్రేడ్ రూల్స్కు విరుద్ధమని యూఎస్ పేర్కొంది. యూఎస్ మెటల్స్పై టారిఫ్స్ “సేఫ్గార్డ్ (లోకల్ కంపెనీలను రక్షించడానికి తీసుకున్న)” చర్యలు కాదని, అందుకే అగ్రిమెంట్ ఆన్ సేఫ్గార్డ్స్ ఆర్టికల్ 8.2 కింద ఇండియా రాయితీలను సస్పెండ్ చేయలేదని పేర్కొంది. ఇండియాతో చర్చించి ఈ వివాదాన్ని పరిష్కరించుకోవడానికి మాత్రం నిరాకరించింది. 2024–25లో ఇండియా యూఎస్కు 4.56 బిలియన్ డాలర్ల విలువైన ఐరన్, స్టీల్, అల్యూమినియం ప్రొడక్టులను ఎగుమతి చేసింది.
బైలేటరల్ ట్రేడ్ డీల్లో పరిష్కారం
ఇరు దేశాల మధ్య కుదరనున్న తాత్కాలిక బైలేటరల్ ట్రేడ్ అగ్రీమెంట్ (బీటీఏ) లో భాగంగా ఇండియా యూఎస్ నుంచి ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ను కోరనుంది. ఇండియాపై టారిఫ్లను తొలగించమని అడగనుంది. దీనికి ఒప్పుకోకపోతే ఇండియా ప్రతీకార చర్యలు తీసుకోవచ్చు. ఈ నెలలో ఇరు దేశాలు తాత్కాలిక డీల్ను కుదుర్చుకోనున్నాయి.
గతంలో ఇంతే..
ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ 2018లో నేషనల్ సెక్యూరిటీ పేరు చెప్పి స్టీల్ దిగుమతులపై 25శాతం, అల్యూమినియం దిగుమతులపై 10 శాతం టారిఫ్ విధించింది. దీనికి ప్రతీకారంగా ఇండియా జూన్ 2019లో 28 యూఎస్ ప్రొడక్ట్స్ (బాదం, వాల్నట్స్ వంటివి)పై కస్టమ్స్ డ్యూటీలను విధించి, డబ్ల్యూటీఓలో ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత, జూన్ 2023లో ఇరు దేశాలు వివాదాన్ని పరిష్కరించుకున్నాయి. ఇండియా స్టీల్, అల్యూమినియం ప్రొడక్ట్స్కు యూఎస్ ప్రభుత్వం రిలీఫ్ ఇచ్చింది. ఇండియా కూడా కొన్ని అమెరికన్ ప్రొడక్ట్స్పై అదనంగా వేసిన సుంకాలను తొలగించింది.