యోసు (కొరియా) : ఇండియా స్టార్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్-–చిరాగ్ షెట్టి జోడీ.. కొరియా ఓపెన్ సూపర్-–500 టోర్నీలో క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు. గురువారం జరిగిన మెన్స్ డబుల్స్ ప్రిక్వార్టర్స్లో మూడోసీడ్ సాత్విక్-–చిరాగ్ 21–-17, 21–-15తో హి జి టింగ్– -జోహు– హో డాంగ్ (చైనా)పై గెలిచారు. 43 నిమిషాల మ్యాచ్లో ఇండియన్ జోడీ ర్యాలీలతో అదరగొట్టింది. కీలక సమయంలో నెట్ వద్ద సూపర్ డ్రాప్స్ వేస్తూ పైచేయి సాధించింది. విమెన్స్ డబుల్స్లో ట్రిసా జోలీ-–గాయత్రీ గోపీచంద్ 11–-21, 4–-21తో బీక్ హ న-–లీ సో హి (కొరియా) చేతిలో పరాజయంపాల య్యాడు. మెన్స్ సింగిల్స్లో ఐదోసీడ్ హెచ్.ఎస్. ప్రణయ్ 15-–21, 21-–19, 18–-21తో లీ చుక్ యియు (హాంకాంగ్) చేతిలో, ప్రియాన్షు రజావత్ 14-–21, 21–-18, 17–-21తో టాప్సీడ్ కొడాయ్ నరోకా (జపాన్) చేతిలో పోరాడి ఓడారు. మిక్స్డ్ డబుల్స్లో రోహన్ కపూర్-–సిక్కి రెడ్డి 15-–21, 12-–21తో నాలుగోసీడ్ ఫెంగ్ యాన్ జా–-హుయాంగ్ డాంగ్ పింగ్ (చైనా) చేతిలో కంగుతిన్నారు